ఈ అవమానంతో షాకయ్యా, నా మాట విన్లేదు: సైరస్ మిస్త్రీ ఆగ్రహం
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తనకు అర్దాంతరంగా ఉద్వాసన పలకడంపై సైరస్ మిస్త్రీ స్పందించారు. చైర్మన్ పదవి నుంచి తనను తొలగించిన పద్ధతి షాక్కు గురి చేసిందని బోర్డు సభ్యులకు అతను ఈ మెయిల్ పంపించారు.
తనను ఇలా తొలగించడం బోర్డుకు ఏమాత్రం మంచిది కాదన్నారు. కనీసం తన వాదన కూడా వినిపించే అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశంలో అసాధారణ విపరీత చర్య అని బోర్డు పైన తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం తనకు లీగల్ చర్య ఆలోచన లేదని చెప్పారు.

టాటా బోర్డులో తొమ్మిది మంది సభ్యులు ఉండగా అందులో ఆరుగురు సైరస్ మిస్త్రీ ఉద్వాసనను సమర్థించారు. దేశంలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీని తొలగించి, తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను నియమించిన విషయం తెలిసిందే.
తనను చైర్మన్ పదవి నుంచి అవమానకరరీతిలో తొలగించడంపై సైరస్ మిస్త్రీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావించినట్లుగా కథనాలు వచ్చాయి. అదే సమయంలో లీగల్ చర్యలు తీసుకోకుండా టాటా గ్రూప్ కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది.
లీగల్ చర్యలు నివారించేందుకు ఉద్దేశించిన కెవియట్ పిటిషన్లను హైకోర్టులో టాటా గ్రూప్ దాఖలు చేసింది. కాగా, ప్రస్తుతం లీగల్ చర్యలు తీసుకునేందుకు మిస్త్రీ సిద్ధపడటం లేదని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications