ఉన్నావ్ అత్యాచార కేసులో ఊహించని మలుపు.. రోడ్డెక్కిన బాధితురాలు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన దోషి, బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 23, 2025న జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్ నేతృత్వంలోని ధర్మాసనం కుల్దీప్ సెంగార్ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఆయన అప్పటికే 7 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష అనుభవించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.
బెయిల్ కోసం షరతులు
అయితే బెయిల్ కోసం కోర్టు కఠినమైన షరతులు విధించింది. రూ. 15 లక్షల వ్యక్తిగత బాండ్, ముగ్గురు షూరిటీలు సమర్పించాలి. బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లకూడదు. బాధితురాలిని లేదా ఆమె తల్లిని బెదిరించకూడదు. తన పాస్పోర్టును కోర్టులో అప్పగించాలి. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. కుల్దీప్ సెంగార్ తండ్రి కస్టోడియల్ మరణం కేసులో ఇంకా 10 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నందున, ఆ కేసులో బెయిల్ వచ్చే వరకు ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది.

ఇండియా గేట్ వద్ద బాధితురాలి నిరసన
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే బాధితురాలు, ఆమె తల్లి, సామాజిక కార్యకర్త యోగితా భయానాతో కలిసి మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు అన్యాయం జరిగిందని, ఈ తీర్పు తన కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. "ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఆయనను బయటకు వదిలేశారు" అని ఆమె ఆరోపించింది. ఢిల్లీ పోలీసులు ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తొలగించి, బస్సులో తరలించారు. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది.
సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బాధితురాలు
హైకోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధితురాలు, తనకు సుప్రీంకోర్టుపై నమ్మకం ఉందని, సెంగార్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications