అప్పుడే చేరికల పర్వం : ఎన్డీఏ క్యాబినెట్లో చేరతామంటున్న అన్నాడీఎంకే, జేడీయూ
న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే అప్పుడే కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీంతో భాగస్వామ్యపక్షలైన అన్నాడీఎంకే, జేడీయూ కేంద్ర క్యాబినెట్లో చేరతామని సంకేతాలిచ్చాయి.

జేడీయూ, అన్నాడీఎంకే ఓకే ?
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో చేరబోతున్నామని జేడీయూ, అన్నాడీఎంకే పార్టీ తెలిపాయి. కేంద్ర క్యాబినెట్లో తమ బెర్తులను అందరికంటే ముందే ఖరారు చేసుకున్నాయి. ఈ మేరకు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం తాము ఎన్డీఏ ప్రభుత్వంలో చేరబోతున్నామని సూత్రప్రాయంగా తెలిపారు.

అప్పుడ నో .. ఇప్పుడు ఎస్ ...
గత ఎన్నికల్లో ఎన్డీఏకు నితీశ్ కుమార్ అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. సొంతంగా పోటీ చేశాడు. కానీ ఈసారి మాత్రం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం బీజేపీ చీఫ్ అమిత్ షా ఇచ్చిన విందుకు కూడా హాజరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిపిట్ అవుతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. తిరిగి మోదీ ప్రధాని కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యపార్టీగా ఉంటామని స్పష్టంచేశారు.

అన్నాడీఎంకే కూడా ...
నితీష్ వెర్షన్ ఇలా ఉంటే తమిళనాడులో అధికార అన్నాడీఎంకే కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. అయితే తొలుత ఎగ్జిట్ పోల్ అంచనాలను తోసిపుచ్చి .. తిరిగి ఎన్డీఏ ప్రభుత్వంలో చేరతామని ఇండికేషన్ ఇచ్చింది. తాము ఎన్డీఏతో కలిసి పనిచేసే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని పన్నీరు సెల్వం తెలిపారు. ఈ అంశంపై పార్టీలో అందరి అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. అయితే వాస్తవానికి ఇప్పటికే అగ్రనేతలు .. ఎన్డీఏలో చేరాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications