కశ్మీర్ పై గుడ్ న్యూస్-తగ్గిన చొరబాట్లు-మరికొన్నాళ్లు పాక్ తో కాల్పుల విరమణ కొనసాగింపు ?
భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో కొనసాగుతున్న కాల్పుల విరమణ మరికొంతకాలం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఒప్పందం అమల్లో ఉంది. త్వరలో శీతాకాలం రానున్నందున అప్పటివరకూ కాల్పుల విరమణ కొనసాగించవచ్చని తెలుస్తోంది. కానీ ఇప్పటికీ సరిహద్దుల్లో పాకిస్తాన్ రిక్రూట్ మెంట్లు కొనసాగిస్తుండటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాకముందు ఉల్లంఘనలు ఎక్కువగా ఉండేవి. కానీ ఫిబ్రవరిలో ఒప్పందం అమల్లోకి వచ్చాక మాత్రం ఉల్లంఘనలు బాగా తగ్గినట్లు సైనిక వర్గాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి నుంచి కేవలం రెండు చొరబాట్లు మాత్రమే జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాకిస్తాన్ వైపు నుంచి చొరబాట్లు భారీగా తగ్గడం, కాల్పుల విరమణ ఉల్లంఘనలు తగ్గడంతో విరమణను మరికొంతకాలం పొడిగించే అంశంపై సైన్యం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్మీ తాజా సమాచారం ప్రకారం, 2020 లో 4,645 కాల్పుల విమరణ ఉల్లంఘనలు చోటు చేసుకోగా.. 2019 లో 3,168, 2018 లో 1,629 లు ఉన్నాయి. ఈ ఏడాది విరమణ అమల్లోకి వచ్చిన ఫిబ్రవరి 25 నుంచి ఇప్పటివరకూ మాత్రం కేవలం 592 ఉల్లంఘనలు మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో శీతాకాలం రానుండగా.. అధిక ఎత్తులో ఉన్న కనుమలు మంచుతో కప్పుకుంటాయి. దీంతో భూభాగం ద్వారా చొరబాట్లు జరిగే అవకాశాలు తగ్గిపోయాయి. ఈ లెక్కన చూస్తే గత కొన్నేళ్లుగా చూస్తే ఈ ఏడాది మాత్రం సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం కశ్మీర్ లోయలో 60-70 మంది విదేశీ ఉగ్రవాదులు మాత్రమే ఉన్నారని అంచనా వేస్తున్నారు. వీరంతా ప్రాథమికంగా పాకిస్థానీలని, వారి వ్యూహం తమపై దాడి చేయడమే కాదు, స్థానికులు ఏదో ఒక కార్యాచరణలో పాల్గొనాలని బలవంతం చేయడం కూడా అని అధికారులు చెప్తున్నారు. ఈ ఏాడాది ఆగస్టు చివరి నాటికి కాశ్మీర్లో 110 మంది ఉగ్రవాదుల్ని సైన్యం హతమార్చింది. జనవరిలో అత్యల్పంగా ముగ్గురు, జూలైలో అత్యధికంగా 33 మంది ఉన్నారు.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్ -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications