నోట్ల మార్పిడిపై ఆందోళన వద్దు: ఆర్బీఐ వద్ద మార్చుకోవచ్చు
ప్రజలు తమ పాత నోట్లను బ్యాంకులలో జమ చేసుకోవచ్చని, ఒక వేళ మార్పిడి చేసుకోవాలనుకుంటే ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది.
న్యూఢిల్లీ/హైదరాబాద్: నవంబర్ 24తో పాత నోట్ల మార్పిడి అవకాశం అన్ని బ్యాంకులలో ముగియడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత రిజర్వు బ్యాంక్ పేర్కొంది. ప్రజలు తమ పాత నోట్లను బ్యాంకులలో జమ చేసుకోవచ్చని, ఒక వేళ మార్పిడి చేసుకోవాలనుకుంటే ఆర్బీఐ కార్యాలయాలకు వెళ్లి నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది.
రద్దైన రూ. 500, 1000 నోట్లను ఆర్బీఐ కార్యాలయాల్లోని కౌంటర్ల వద్ద మార్చుకోవచ్చని తెలిపింది. ప్రజల కోసం అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల మేరకు ఈ పాత నోట్ల(రూ.2వేల వరకు) మార్పిడికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

పాత నోట్ల మార్పడిని రద్దు చేస్తూ ప్రభుత్వం గురువారం ప్రకటన జారీ చేసింది. కాగా, పాత రూ. 500 నోట్లతో కొన్ని చెల్లింపులకు డిసెంబర్ 15 వరకు గడువును పెంచిన విషయం తెలిసిందే.
కాగా, పెద్ద నోట్ల మార్పిడి ఇతర బ్యాంకులలో నిలిచిన నేపథ్యంలో దేశంలోని ఆర్బీఐ కార్యాలయాల వద్ద జనం బారులు తీరుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆర్బీఐ కార్యాలయం వద్ద కూడా తమ నోట్లను మార్చుకునేందుకు భారీగా ప్రజలు చేరుకున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications