పెరిగిన చలి తీవ్రత: హైదరాబాద్లో దశాబ్ద కాలంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లిపోవడంతో రాష్ట్రంలో వాతావరణం చల్లగా మారిపోతోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక హైదరాబాద్ నగరంలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్లోని బేగంపేటలో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. సాధారణంగా బేగంపేటలో అక్టోబర్ నెలలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేదని అధికారులు వెల్లడించారు.

మరో నాలుగు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని అంచనా. మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో తెలంగాణలోనే అత్యల్పంగా 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కాగా, రానున్న రెండు రోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల నుంచి 19 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
విస్తరించిన ఉపరితల ఆవర్తనం- ఏపీలో 15 జిల్లాల్లో వర్షాలు -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications