నేను కాంగ్రెస్లో ఉండగా: జూపల్లి ఆసక్తికరం, రేపు మోడీతో కేసీఆర్ భేటీ
నల్గొండ: తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ తరహా పాలన సాగలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆదివారం అన్నారు. మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఆయన నల్గొండ జిల్లాలో పర్యటించారు.
మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు గుండాల మండలం అనంతారంలో సీసీ రోడ్డు పనులకు, గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటి నీళ్లు పోశారు. గుండాల మండలం సుద్దాలలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

కాగా, వరంగల్లోని కాకతీయ వర్సిటీలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్పీకర్ మధుసూధనా చారి, మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టిచబోతున్నారన్నారు. ప్రతీ ఒక్కరు హరితహారంలో పాల్గొని పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు.
రేపు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అంతర్రాష్ట మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. సీఎం రేపు ప్రధాన మంత్రి మోడీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మోదీతో సమావేశమవుతారు. హైకోర్టు విభజన, ఆంధ్రా న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడం తదితర అంశాలపై చర్చించే అవకాశముంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications