పోలీసుల అదుపులో దివ్వెల మాధురి..?
సస్పెన్షన్ కు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య దివ్వెల మాధురి మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. బర్త్ డే ఫంక్షన్ సందర్భంగా అనుమతి లేకుండా మద్యం పార్టీని నిర్వహించినందు వల్ల వారిని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.
దివ్వెల మాధురి బర్త్ డే సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫంక్షన్ నిర్వహించారని సమాచారం. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో గల ది పెండెంట్ అనే ఫామ్ హౌస్ లో ఈ ఫంక్షన్ ఏర్పాటైంది. దీనికి పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ లో జోరుగా మద్యం పార్టీ సాగింది. నిబంధనల ప్రకారం ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు గానీ, ఫామ్ హౌస్ యాజమాన్యం గానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఈ సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటీ అధికారులు సంయుక్తంగా ఫామ్ హౌస్ పై దాడులు నిర్వహించారు. పార్టీని భగ్నం చేశారు. నిర్వాహకుల నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు ఎస్ఓటీ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఫామ్ హౌస్పై సంయుక్తంగా దాడి చేసి బర్త్ డే పార్టీని భగ్నం చేశారు.
అనుమతి లేకుండా మద్యం సేవించడం, లిక్కర్ బాటిళ్లను నిల్వ ఉంచడం, బర్త్ డే పార్టీలో శృతి మించిన స్థాయిలో డీజే సౌండ్స్ వినియోగించడం వంటి కారణాలతో పోలీసులు, ఎస్ఓటీ అధికారులు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు దివ్వెల మాధురి. కొద్దిరోజుల కిందటే హౌస్ నుంచి ఎవిక్ట్ అయ్యారు. ఆమె పుట్టిన రోజు నాడు వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications