టీడీపీ-వైసీపీలకు షాక్: 'అవిశ్వాసం అంటే పిల్లలాట కాదు, పట్టించుకోం'
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం, తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం మేరకే తాము పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మంగళవారం చెప్పారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.
లోకసభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీయే ఈ నాటకం ఆడిస్తోందని వస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. తమ పార్టీని ఆడించే సత్తా ఎవరికీ లేదన్నారు. అవిశ్వాస తీర్మానం అంటే పిల్లలాట కాదన్నారు.

టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిపాదిస్తున్న అవిశ్వాసం రాజకీయ అజెండాగా కనిపిస్తోందని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తమకు కావాల్సింది రాజకీయ అజెండా కాదని, ప్రజల అజెండా ముఖ్యమని చెప్పారు.
అసలు మాతో చర్చించకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేం ఎందుకు మద్దతిస్తామని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ ఎవరికీ సామంత రాష్ట్రం కాదని, స్వతంత్ర రాష్ట్రమని చెప్పారు. పక్క రాష్ట్రం పార్టీలను తాము పట్టించుకోమన్నారు.
ఇదిలా ఉండగా, పార్లమెంటులో టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యుల ఆందోళన వెనుక బీజేపీ ఉందని తెలుగుదేశం అనుమానిస్తోంది. అవిశ్వాసంపై చర్చ రాకుండా ఉండేందుకు కేంద్రం వారితో ఆందోళనలు చేయిస్తోందని అనుమానిస్తున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications