రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. రేపు సభలో అడుగుపెట్టనున్న కేసీఆర్..
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్, మండలి ఛైర్మన్ సమీక్ష నిర్వహించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి వాడీవేడిగా సాగనున్నట్లు స్పష్టం అవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి(డిసెంబర్ 29, సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు జనవరి మొదటివారం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈమేరకు తాజాగా అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్, మండలి ఛైర్మన్ సమీక్ష నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఇప్పటివరకూ కేసీఆర్ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి కాగా.. రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.
ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు.. తదితర కీలక నేతలు కూడా సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, రెండేళ్ల కాంగ్రెస్ పాలన, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గుదల, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

అలాగే అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. నీటి కేటాయింపులు విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఈ విషయంపై రాష్ట్రస్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సభలు ఏర్పాటు చేసి ఆ సభల వేదికగా దిశానిర్దేశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications