జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన వైఎస్ జగన్
ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేయడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్టు సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను తాను ఖండిస్తున్నానంటూ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛపై ఇది డైరెక్ట్ ఎటాక్ అని అన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు, రిపోర్టర్ లను అక్రమంగా అరెస్ట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ అంశంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టును ఖండించారు.
I strongly condemn the arrests of NTV journalists, which amount to a direct attack on the freedom of the press and democratic values. Forcefully entering journalists’ homes by breaking doors at midnight during this festival and arresting them without following due legal procedure…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026
" జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కుకు ఇది డైరెక్ట్ ఎటాక్ లాంటిది. జర్నిలిస్టుల ఇంట్లోకి బలవంతంగా చొరబడి అర్ధరాత్రి అరెస్టు చేయడం.. లీగల్ ప్రొసీజర్ ఫాలో కాకుండా.. ఫెస్టివల్ సమయంలో ఇలా చేయడం ప్రభుత్వ నియంతృత్వపు పోకడను గుర్తు చేస్తుంది. జర్నలిస్టులు టెర్రరిస్టులు కాదు.. క్రిమినల్స్ కాదు. ఇలాంటి చర్యలు జర్నలిస్టుల కుటుంబాల్లో మానసిక ఆందోళనలకు గురిచేస్తాయి. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చట్టాన్ని, రూల్ ఆఫ్ లా, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుకుంటున్నా" అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇక ఆ న్యూస్ ఛానల్ ఛైర్మన్ పారిపోయారంటూ వస్తున్న సమాచారం సరైంది కాదని తెలుస్తోంది. ఆ ఛైర్మన్ ఆఫీస్ లోనే ఉన్నట్లు ఎక్కడికీ పారిపోలేదని సమాచారం అందుతోంది.

ఇక ఇదే అంశంపై ఆ న్యూస్ ఛానల్ యాంకర్ దేవి కీలక వ్యాఖ్యలు చేశారు. "వృత్తి ధర్మం పాటించడమే నేను చేసిన తప్పా ? యాజమాన్యం క్షమాపణలు చెప్పినా నన్ను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. మా ఇంటికొచ్చి నా భర్తతో మాట్లాడి వాళ్లని కూడా ఇబ్బంది పెట్టారు. మూడు గంటల పాటు మెంటల్ టార్చర్ చేస్తూ ప్రశ్నలు అడిగినా సమాధానం ఇచ్చాను. పోలీసులు ఇంత దాష్టికానికి ఎందుకు పాల్పడుతన్నారు ?" అని యాంకర్ దేవి ప్రశ్నించారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
భారీగా పెరిగిన యూజర్ ఛార్జీలు, ఇక ఈ సేవలు మరింత భారం..!! -
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications