ఎన్నారై భర్త నుండి కాపాడాలని టెక్కీ ఫిర్యాదు
పెళ్లైన ఏడాది తర్వాత శిరీషాకి వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి. ప్రేమ వివాహం కారణంగా కట్నం రాలేదని, ఆ కట్నం మొత్తాన్ని పుట్టింటి నుండి తీసుకు రావాలని అత్త, మామ, మరిది నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పురిటి కోసం హైదరాబాద్కు వచ్చిన ఆమెను భర్త తిరిగి తీసుకుపోలేదు.
ప్రస్తుతం ఉదయ్, శిరీషల కూతురుకు మూడు సంవత్సరాలు. ఆమె భర్త విడాకుల కోసం ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయం చేయాలని కోరుతూ శిరీషా గురువారం హెచ్చార్సీని ఆశ్రయించారు.. తనకు తన భర్త, అత్తమామల నుండి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపిస్తున్నారు.
తన భర్త మరొక మహిళతో కలిసి ఉంటున్నాడని, వారికి వివాహమైనట్టు తెలుస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శిరీష్ ఫిర్యాదును స్పీకరించిన హెచ్చార్సీ ఈ వ్యవహారంపై దర్యాఫ్తు జరిపి నవంబర్ 21లోగా నివేదిక సమర్పించాలని ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది.