శ్రీలక్ష్మీ నీ మహిమలు..: కోట్లలో పెట్టుబడులు?

కేరళ, తమిళనాడులోని ప్రయివేటు విద్యుత్ ప్రాజెక్టులలో శ్రీలక్ష్మి ఏమైనా పెట్టుబడులు పెట్టిందా అనే కోణంలో సిబిఐ విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఆధాకాలు లభిస్తే ఓఎంసి కేసు మరో మలుపు తిరుగుతుంది. ఓఎంసి కేసులో సిబిఐచే అరెస్టు కాబడిన శ్రీలక్ష్మి ఆరు నెలలు జైలులో ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఇటీవల బెయిల్ పైన బయటకు వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసికి గనులు కేటాయించారనే అభియోగం ఆమెపై ఉంది.
ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు గాలి అనుచరుడు అలీ ఖాన్ను కూడా సిబిఐ అరెస్టు చేసింది. అలీ ఖాన్ అనేక రహస్యాలను సిబిఐ అధికారుల ముందు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఓఎంసికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని చెప్పారని తెలుస్తోంది. దీని ఆధారంగా శ్రీలక్ష్మికి కూడా ముట్టి ఉంటాయని సిబిఐ భావిస్తోందట. ఈ డబ్బును ఇతర రాష్ట్రాలకు మళ్లించి అక్కడ పెట్టుబడులు పెట్టి ఉంటారని అనుమానిస్తోంది.
అలీ ఖాన్ చెప్పిన వివరాల ఆధారంగా శ్రీలక్ష్మి బినామీ ఆస్తుల పైన సిబిఐ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. బంధువుల పేర్ల మీద పక్క రాష్ట్రాల్లో విద్యుత్తు సంస్థల్లో పెట్టుబడులు పెట్టారన్న అనుమానంతో ఆయా రాష్ట్రాల నుంచి సిబిఐ అధికారులు వివరాలు తెప్పించుకున్నారట. అక్కడి ప్రయివేటు విద్యుత్ సంస్థలు, వాటిలో భాగస్వాముల వివరాలను, వారి పెట్టుబడులును పరిశీలిస్తున్నారట.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications