కేసీఆర్ ఎంఏ చదువుతున్న రోజుల్లో: ఆ ముగ్గురు మాట్లాడుతుంటే.. అలా వింటుండేవాడు!
1970లో కేసీఆర్ ఎంఏ స్టూడెంట్గా ఉన్న రోజులవి. అప్పట్లో అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు ఆయన వెళ్తుండేవారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన వాగ్దాటితో మంత్రముగ్దుల్ని చేసే ఆయన.. విద్యార్థిగా ఉన్నప్పుడు ముగ్గురి ప్రసంగాలను బాగా ఇష్టపడేవాడినని చెప్పుకొచ్చారు.
Recommended Video

తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల నేపథ్యంలో.. గురువారం నిర్వహించిన బీఏసీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి బీఏసీతో సమావేశమైన ఆయన అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

ఎవరా ముగ్గురు?:
1970లో కేసీఆర్ ఎంఏ స్టూడెంట్గా ఉన్న రోజులవి. అప్పట్లో అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు ఆయన వెళ్తుండేవారు. గ్యాలరీలో కూర్చొని సభ జరుగుతున్న తీరును పరిశీలించేవారు. ఆ సమయంలో ముగ్గురు నేతలు ఆయన్ను బాగా ప్రభావితం చేశారు.
ఆ ముగ్గురు అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత రాజ్యసభ టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎమ్మెల్సీలు యజ్ఞ నారాయణ, మాణిక్ రావు. ఈ ముగ్గురు శాసనమండలిలో మాట్లాడుతుంటే తాను నిశితంగా గమనించేవాడినని, వారి వాగ్దాటి ఆకట్టుకునేదని కేసీఆర్ స్వయంగా తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

వాళ్లకు మంత్రులు కూడా భయపడేవాళ్లు:
శాసనమండలిలో కేశవరావు, యజ్ఞ నారాయణ, మాణిక్ రావు వంటి నేతలు మాట్లాడుతుంటే.. వారికి సమాధానం చెప్పడానికి మంత్రులు కూడా భయపడేవాళ్లని అప్పటి విషయాలను కేసీఆర్ ఇప్పటి శాసనమండలి బీఏసీ సభ్యులతో పంచుకున్నారు. ఒక్కోసారి ఏకధాటిగా మూడు గంటల పాటు వాళ్లు మాట్లాడేవారని, గ్యాలరీలో కూర్చొని చర్చను జాగ్రత్తగా గమనించేవాడినని గుర్తుచేసుకున్నారు.

కేసీఆర్ సూచనలు:
అప్పట్లో తాను శాసనమండలి వ్యవహారాల్లో యాక్టివ్ గా పాల్గొంటుండేవాడినని, అసెంబ్లీకి మాత్రమే పరిమితం కాలేదని కేసీఆర్ శాసనమండలి బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సభ్యులతో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు సలహాలు సూచనలు కూడా చేశారు. ఒక సబ్జెక్టుపై ఒకే సమయంలో అసెంబ్లీ, శాసనమండలిలో చర్చ జరగవద్దన్నారు. మొదట అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత.. కొద్దిరోజులకు శాసనమండలిలో దానిపై చర్చ జరగాలన్నారు.

ఇదే తొలిసారి:
శాసనమండలి చీఫ్ విప్ పాటూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలి బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్ తొలిసారి హాజరయ్యారని పేర్కొన్నారు. సమావేశంలో కేసీఆర్ పాల్గొనడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి ప్రశ్నోత్తరాల సమయాన్ని మరో అరగంట పాటు పొడగించాలని కేసీఆర్ సూచించినట్టు సుధాకర్ రెడ్డి తెలిపారు. శాసనమండలి సభ్యులు కూడా సమస్యలపై ప్రభుత్వానికి పిటిషన్స్ ఇచ్చే సాంప్రదాయం రావాలని సూచించినట్టు తెలిపారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications