వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పీఆర్పీ నాయకుల మధ్య ఘర్షణ
విజయవాడ: రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలో పీఆర్పీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. పతాకావిష్కరణ సందర్భంగా అర్భన్ కన్వీనర్ కేసినేని నాని, జిల్లా కన్వీనర్ విజయనిర్మల వర్గీయుల మధ్య వాగ్వాదం జరగడంతో ఘర్షణకు దారితీసింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జోక్యం చేసుకొని శాంతిపజేశారు. విజయనిర్మల భర్తపై కేసినేని నాని వర్గీయులు చేయి చేసుకున్నారు. బాహాబాహీకి తలపడి నానీ వర్గీయులు విజయనిర్మలను గదిలో బంధించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు వచ్చి శాంతింపజేశారు.
Story first published: Wednesday, January 28, 2009, 14:12 [IST]