ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు కేంద్ర మంత్రి ఏఆర్ అంతూలే శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన పెరేడ్గ్రౌండ్స్కు చేరుకున్నారు. తర్వాత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ అక్కడికి చేరుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ముంబయి పేలుళ్లలో తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన అధికారులు హేమంత్ కర్కరే, అశోక్కామ్టే, విజయ్సలాస్కర్, ఉన్నికృష్ణన్, గజేంద్రసింగ్ తదితరులకు ప్రకటించిన అశోక్చక్ర అవార్డులను వారి కుటుంబసభ్యులకురాష్ట్రపతి అందజేశారు.
ఇంకా మరో 13మందికి కీర్తిచక్ర అవార్డులు, 30 మందికి శౌర్యచక్ర అవార్డులు అందజేశారు. అనంతరం వివిధ రాష్ట్ర శకటాలు, భద్రతాదళాల పెరేడ్ తిలకించారు. ఈ సందర్భంగా ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో భద్రతాఏర్పాట్లు చేశారు. కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.