చిన్న పార్టీలతో కాదు: బాబు

హైదరాబాద్కు తాము అంతర్జాతీయంగా గుర్తింపు తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్నో మురికికూపంగా మార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉండగా కృష్ణా జలాలను రాజధానికి తరలిస్తే ఆ నీటిని కూడా సరిగా పంపిణీ చేసే పరిస్థితిలో కూడా వైఎస్ సర్కార్ లేదని విమర్శించారు. భోలక్పూర్లో కలుషిత నీటిని సరఫరా చేసి ప్రాణాలు బలిగొన్నారన్నారు. ఆఖరికి చెత్త రవాణా కాంట్రాక్టులోనూ ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "హైదరాబాద్ చుట్టూ 200పైగా ఇంజనీరింగ్ కళాశాలలు మా హయాంలోనే వచ్చాయి. డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేసి 27లక్షలమందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తే ఈ ప్రభుత్వం కనీసం వాటికి గ్యాస్ సరఫరా చేయలేకపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దళారుల దోపిడీ పెచ్చుమీరిపోయింది" అని ఆయన విమర్శించారు. హైదరాబాద్ నగర శివార్లు తెదేపాకు కంచుకోటగా ఉండేవి మొన్నటి ఎన్నికల్లో కొన్ని లోటుపాట్ల వల్ల ఓడిపోయామన్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ పూర్వవైభవం తేవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట మాజీ ఎంపీ, మాజీ మంత్రి మల్యాల రాజయ్య శుక్రవారమిక్కడ చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఎన్నికలకు ముందు ప్రరాపాలో చేరిన ఆయన.. అక్కడినుంచి ఇప్పుడు తెదేపాలోకి వచ్చారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
AP Cabinet: ఏపీ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ..! ఐదుగురికి ఛాన్స్? జనసేనకు మరో మంత్రి..! -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications