వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై మళ్లీ దద్దరిల్లిన పార్లమెంటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: తెలంగాణ, అధిక ధరలపై బుధవారం పార్లమెంటు ఉభయ సభలు దద్ధరిల్లాయి. ప్రతిపక్షాలన్నీ అధిక ధరలపై ప్రభుత్వాన్ని నిలదీయంగా, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు తెలంగాణపై ఆందోళనకు దిగాయి. లోకసభ తొలుత రెండు సార్లు వాయిదా పడి, ఆ తర్వాత మర్నాటికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో ఆందోళన చెలరేగింది. తొలుత వాయిదా పడిన రాజ్యసభ తిరిగి 12 గంటలకు సమావేశమై సజావుగా సాగింది.

లోకసభ సమావేశం కాగానే ప్రతిపక్షాల సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. బిజెపి, వామపక్షాలు, సమాజ్ వాదీ పార్టీ, బిఎస్పీ, శివసేన అధిక ధరలకు నిరసనగా నినాదాలు చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. నలుగురు తెలుగుదేశం సభ్యులు సమైక్యాంధ్ర నినాదంతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించగా, ఒక సభ్యుడు జై తెలంగాన నినాదంతో కూడిన ప్లకార్డును ప్రదర్శించారు. కొంత మంది కాంగ్రెసు సభ్యులు కూడా జై తెలంగాణ ప్లకార్డులను ప్రదర్శించారు.

తెలంగాణ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు ఎంవి మైసురారెడ్డి, నందమూరి హరికృష్ణ రాజ్యసభలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజన జరగకూడదని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన కొంత మంది కాంగ్రెసు సభ్యులు వారికి తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దాంతో సభ 30 నిమిషాలు వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X