రామలింగరాజుకు రక్తస్రావం, మళ్ళీ నిమ్స్ కు

గత ఏడాది డిసెంబర్ 16న రామలింగరాజు ప్రకటించిన నిర్ణయం మోసంగా ధృవపడి ఆయనను కటకటాల పాలుచేసింది. తన కుటుంబానికే చెందిన మేటాస్ ప్రాపర్టీస్ లో 100 శాతం; మేటాస్ ఇన్ఫ్రాలో 51 శాతం వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు ఆ రోజు సాయంత్రం ప్రకటించి కార్పొరేట్ రంగంలో ఓ సంచలనం సృష్టించారు. ఆ కొనుగోలు విలువ 1.6 బిలియన్ డాలర్లు అంటే రూ.7,680 కోట్లన్నమాట. అంతే ఒక్కసారిగా దేశ, విదేశీ మదుపుదార్ల నుంచి రాజుకు ఫోన్ల వర్షం. అందరి నుంచీ ప్రతిఘటన ఎదురైంది. ఒక ఐటీ కంపెనీ స్థిరాస్తి కంపెనీలను ఏ ప్రాతిపదికన కొంటుంది? అసలు వాటి విలువను ఏ విధంగా లెక్కగట్టారు అని ప్రశ్నించారు వారంతా. ఉక్కిరిబిక్కిరైన రాజు ఆ ప్రతిపాదనను 17 సాయంత్రానికల్లా విరమించుకున్నారు.
జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. సత్యం షేర్లు సగానికి సగం పైగా పతనం అవడం పక్కన బెడితే బోర్డు సభ్యులు తమ తప్పు లేదంటూ వైదొలగడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో బోర్డు సమావేశానికి నాయకత్వం వహించిన అప్పటి ఐఎస్బీ డీన్ రామ్మోహన్ రావు సహా స్వతంత్ర డైరెక్టర్లు సత్యం బోర్డుకు రాజీనామా చేశారు. డైరెక్టర్లందరూ ఒక్కొక్కరిగా వైదొలుగుతున్న తరణంలోనే రామలింగరాజు సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. కంపెనీలో ఖాతాలను ఎక్కువ చేసి చూపించామని, రూ.7,500 కోట్ల మేరకు ఖాతాల కుంభకోణం జరిగిందని స్వయంగా వెల్లడించారు. అంతే అప్పటి దాకా ఉన్న రాజయోగం కాస్తా కటకటాలు లెక్కించాల్సిన స్థితికి తీసుకొచ్చింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications