సమైక్యంగా ఉంటేనే ముద్దు: సమైక్యాంధ్ర జెఎసి
ప్రొఫెసర్ ఎన్. శామ్యూల్ నేతృత్వంలో జెఎసి ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీకృష్ణ కమిటీని కలిసి తన వాదనలు వినిపించింది. హైదరాబాద్ ను వేరు చేసి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి గురించి చెప్పాల్సిందిగా కమిటీ కోరిందని, మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందేందుకు ఉన్న ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించిందని కమిటీతో భేటీ అనంతరం శామ్యూల్ మీడియా ప్రతినిదులకు తెలిపారు.
మూడు ప్రాంతాల్లోని వెనకబాటుతనాన్ని తొలగించేందుకు, వెనుకబడినవర్గాలకు మేలు చేసేందుకు ఉన్న మార్గాలను చెప్పాలని కోరిందన్నారు. ఈ అంశాలపై మరో నివేదికను అందిస్తామని కమిటీకి చెప్పామని శామ్యూల్ పేర్కొన్నారు. కమిటీని కలిసిన వారిలో జెఎసి అధ్యక్షుడు పి. నరసింహారావు, ఈజే నాయుడు, ఎంఎల్ కాంతారావు, నారాయణ తదితరులు ఉన్నారు.
Comments
సమైక్యాంధ్ర జెఎసి శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్ శామ్యూల్ unified andhra jac srikrishna committee hyderabad shamuel
Story first published: Wednesday, May 12, 2010, 9:35 [IST]