పరిటాల రవి హత్యలోనూ భాను కిరణ్ పాత్ర, మొద్దు శీనుతో గొడవ?

అరెస్ట్కు ముందు ఢిల్లీలో తలదాచుకున్న శీను భానుతో అనేకసార్లు గొడవ పడ్డాడని చెప్పినట్లు ఆ పత్రిక రాసింది. శీను కొంతకాలం అనంతపురం జి ల్లా జైల్లో ఉన్నప్పుడు సూరి కూడా అక్కడే ఉన్నాడు. తన కుటుంబానికి డబ్బులు పంపించే విషయంలో భాను నిర్లక్ష్యంగా ఉంటున్నాడని, భానును అన్ని విషయాల్లో నమ్మవద్దని, వీలె ౖతే కొంత దూరం పెట్టాలని సూరికి శీను సూచించాడని ఆ నేత వివరించారు. సూరికి భాను నమ్మిన బంటు కావడంతో పాటు కేసులో ఆయన్ను ఇరికించకూడదన్న ఉద్దేశంతోనే ఈ వ్యవహారాన్ని ఇంత కాలం రహస్యంగా ఉంచినట్టు తెలిపారు.
ఆ పత్రిక కథనం ప్రకారం - సూరి హత్యానంతరం అనంతపురంలోని భాను నివాసంలో ఇటీవల పోలీసులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా మంగళి కృష్ణకు చెందిన లేఖలు దొరికినట్లు తెలిసింది. తనకు రక్షణ కావాలని ప్రభుత్వ పెద్దల కు కృష్ణ రాసిన లేఖల ప్రతులు దొరికాయని తెలుస్తోంది. పరిటాల హత్యలో కృష్ణ పాత్ర కూ డా ఉందనే ఆరోపణలు రాగా అప్పుడాయన ఖండించారు. ఒకసారి పరిటాల ఆయన పేరును ప్రస్తావించి, తనను హతమార్చేందుకు ప్రైవేటు గ్యాంగ్ నడుపుతున్నాడని ఆరోపించా రు. ఇప్పుడు అదే కృష్ణ లేఖలు భాను నివాసంలో లభించడం గమనార్హం. భాను చిక్కితే పరిటాల హత్యోదంతంలో అనేక మంది పెద్దల పాత్ర బయటపడుతుందంటున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications