వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాంతీయ ఒత్తిళ్లు నష్టం: తెలంగాణపై మనీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gorkhaland Map
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం భావోద్వేగాలకు సంబంధించినది అని ఏఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారి సోమవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. అందరూ సహనం వహించాలని ఆయన సూచించారు. ప్రాంతీయ ఒత్తిళ్ల వల్ల జాతీయ ప్రయోజనాలకు నష్టం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఒత్తిళ్ల వల్ల జాతి ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందన్నారు.

గుర్ఖాలాండుకు, తెలంగాణకు సంబంధం లేదన్నారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తెలంగాణ విషయంలో అందరితో చర్చించి జాతీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణలో సెంటిమెంట్ తీవ్రంగా ఉందన్నారు. ఒత్తిళ్ల వల్ల ప్రయోజనం లేదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని, గతంలో కూడా తాము ఇదే విషయం చెప్పామని ఆయన అన్నారు.

English summary
AICC spokes person Manish Tiwari said today that Gorkhaland is different to Telangana issue. He hoped that Telangana issue will be clear soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X