గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ...
గుంటూరు జిల్లా: వైసిపి అధినేత జగన్ పాదయాత్ర నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 116వ రోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్ పాదయాత్రకు హాజరైన స్థానిక వైసిపి కార్యకర్తలు ప్రజాసంకల్పయాత్ర తమ ప్రాంతంలో ముగిసిన అనంతరం ర్యాలీగా బయలుదేరి తిరిగివెళుతున్నారు. ఈ క్రమంలో కొప్పర్రులో మైకులు పెట్టుకుని మా కాలనీలోకి ఎందుకు వచ్చారంటూ టీడీపీ మైనారిటీ నేతలు వీరిని అడ్డుకున్నారు.

దీంతో ఈ విషయమై వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని అది ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో టిడిపి వర్గీయులు ఒక వైసిపి కార్యకర్తపై దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు. ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి ఇరువర్గాలకు సర్థిచెప్పి... కొప్పర్రు గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.
మరోవైపు గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్నజగన్ పాదయాత్ర మంగళవారం ఉదయం పెదనందిపాడు శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ నుండి రాజుపాలెం క్రాస్, పాలపర్రు, పరిట్లవారిపాలెం క్రాస్, అన్నవరం క్రాస్ మీదగా ఉప్పలపాడు వరకూ జగన్ 116 వ రోజు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications