ఏపీఎస్ఆర్టీసీ: ఒప్పంద ఉద్యోగుల రెగ్యూలరైజ్ చేసే ప్రక్రియ ప్రారంభం
అమరావతి: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యూలర్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ నెలాఖరులోగా సిబ్బంది వివరాలను పంపించాలని ఆర్ఎంలను ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదేశించారు.
డిసెంబర్ 31 నాటికి 240 రోజులు పూర్తయిన వారి వివరాలను పంపించాలని కోరారు. కొత్త ఏడాదిలో కాంట్రాక్ట్ సిబ్బందిని ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం క్రమబద్దీకరించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదేశాలపై ఈయూ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముందే సంక్రాంతి..
ఏపీలో రైతులకు ముందే సంక్రాంతి పండగ వచ్చింది. మంగళవారం రైతు భరోసా, నివర్ తుపాను నష్ట పరిహారం చెల్లింపులను ప్రభుత్వం చేయనుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా మూడో విత రూ. 1,120 కోట్లు చెల్లింపులతో 51.59 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
Recommended Video
కాగా, నివర్ తుపాను కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారాన్ని అందించనుంది. రూ. 646 కోట్లు నివర్ పరిహారాన్ని సీఎం వైఎస్ జగన్.. రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.