లోకేష్ పర్యటనలో గాయపడిన అభ్యర్థి మాగంటి బాబు
దాన్ని కూడా లెక్కచేయకుండా ఆయన ఆదివారం ఆసాంతం లోకేశ్తోనే ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం నాటికి గాయాల తీవ్రత పెరగడంతో ఆయనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయాలను మాగంటి తేలిగ్గా తీసుకున్నా కుటుంబ సభ్యులు, నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 15 ఏళ్ల కిందట మాగంటికి తుంటి భాగంలో శస్త్ర చికిత్స జరిగిందని, ఇపుడు అది కూడా తిరగబెట్టిందని వైద్యులు తెలిపారు.
ఇదిలావుంటే, మెదక్ జిల్లా గజ్వేల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డి సోదరుడు, మండల టిడిపి అధ్యక్షుడు వంటేరు శ్రీనివాస్రెడ్డికి సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. గజ్వేల్లో జరిగిన చంద్రబాబు సభలో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం తిరుగు ప్రయాణమవుతుండగా మండలంలో రాంనగర్ వద్ద కారు బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్రెడ్డితోపాటు మరో టిడిపి నాయకుడు రమేశ్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.