వందే భారత్ మిషన్-ఎల్లుండి నుంచి నేరుగా విజయవాడకు విదేశీ విమానాల రాకపోకలు
వందే బారత్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో విదేశీ విమానాల రాకపోకల్ని పాక్షికంగా పునరుద్ధరించబోతోంది. ఇందులో భాగంగా విజయవాడకు కూడా నేరుగా విదేశీ విమానాల్ని అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం భారత్లో కరోనా వ్యాప్తి కారణంగా పలు దేశాలు విమాన సర్వీసులు రద్దు చేసుకోగా.. భారత్ కూడా విదేశీ విమానాలను అనుమతించడం లేదు. కానీ వందే భారత్ కార్యక్రమం కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకురానున్నారు.
వాస్తవానికి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విదేశాల నుంచి భారత్కు వచ్చే విమానాలు నిలిచిపోయాయి. దీంతో విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అడపాదడపా దేశీయ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. కానీ అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో విజయవాడ విమానాశ్రయం కళతప్పింది. ఇప్పుడు వందే భారత్ మిషన్ కింద పాక్షికంగా స్పెషల్ సర్వీసులు ప్రారఁభమవుతున్నా ఢిల్లీ, చెన్నై వంటి విమానాశ్రయాలకే ఈ రాకపోకలు ఉంటాయని భావించారు. కానీ విజయవాడకు కూడా నేరుగా వందే భారత్ విమానాల్ని అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది.

Recommended Video
కరోనాకు ముందు విజయవాడ ఎయిర్పోర్టుకు విదేశీ విమానాల రాకపోకలు సాధారణంగా ఉండేవి. అప్పట్లో సింగపూర్తో పాటు దుబాయ్, ఇతర దేశాలకు రెగ్యులర్గా విమానాలు ఉండేవి. కరోనా వ్యాప్తి తర్వాత విదేశీ విమానాలు తగ్గిపోవడం, దేశీయ సర్వీసుల్లో వచ్చే ప్రయాణికులకు కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తుండటంతో రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు వందే భారత్ మిషన్ కింద తిరిగి నేరుగా విమానాలు అనుమతిస్తున్నారు. అయితే కరోనా టెస్టులు మాత్రం తప్పనిసరిగా నిర్వహిస్తారు. పాజిటివ్గా తేలితే క్వారంటైన్లో ఉంచి చికిత్స తీసుకున్నాకే పంపుతారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications