మోడీవి అనాలోచిత నిర్ణయాలు.. అగ్నిపథ్ అలాంటిదే: రేవంత్ రెడ్డి ఫైర్
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. పథకం వద్దని నిరసనలు హోరెత్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మోడీపై, బీజేపీపై సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ చదువు లేని వ్యక్తి అని, అందుకే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారని కామెంట్ చేశారు.
బీజేపీ పరిస్థితి కూడా అంతకంటే భిన్నమేమీ కాదని రేవంత్ అన్నారు. సైనిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో మోడీకి తెలియదన్నారు. ఇతర దేశాలు దాడులు చేస్తే ప్రతిదాడులకు సైన్యాన్ని వినియోగిస్తారని, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు సైనికులు రంగంలోకి దిగుతారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అగ్నిపథ్ కింద నాలుగేళ్ల పాటు ఆయుధాల వాడడంపై శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారిని బయటికి పంపిస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు.

అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి అంశంలో అయోమయం సృష్టించి తప్పుదోవ పట్టించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. ఇజ్రాయిల్ చిన్న దేశం, దానితో పోల్చడం కరెక్ట్ కాదన్నారు. అమెరికాలో ఆర్మీ నుంచి బయటకు రాగానే అవకాశాలు ఉన్నాయని.. భారత్లో పరిస్థితి భిన్నమని రేవంత్ అన్నారు. నిరుద్యోగ తీవ్రత ఎక్కువ ఉందని, అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మోడీ ప్రభుత్వం కీలక అంశాలను ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వివరించారు. నోట్ల రద్దు కూడా పెద్ద అనాలోచిత నిర్ణయం అనేవారు ఉన్నారు. దాదాపు 150కి పైగా ప్రజలు ఏటీఏం సెంటర్లలో నిలబడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ రాహుల్ గాంధీ విమర్శలు చేస్తుంటారు. ఆయా అంశాలను నేతలు ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు రేవంత్ అగ్నిపథ్ పథకంపై ఫైర్ అయ్యారు. యువత గురించి ఆయన ఏమాత్రం ఆలోచించలేదని విరుచుకుపడ్డారు.
-
"ప్రధాని మోదీ ఒక్క ఫోన్ కాల్.. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ముగింపు" -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications