దారుణం: విద్యార్థిపై దాడి, హాస్టల్ గదిలో తెగబడ్డ స్టూడెంట్స్, కారణమిదే.?
హైదరాబాద్లో ఓ విద్యార్థిపై తోటి స్టూడెంట్స్ దాడికి తెగబడ్డారు. ఈ ఘటన ఈ నెల 1వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 11వ తేదీన (నిన్న) సదరు విద్యార్థిని ఫిర్యాదు చేయడం.. ఆ వీడియో కూడా ట్రోల్ అవుతుంది. ఇంతకీ సదరు విద్యార్థి మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అని స్టూడెంట్స్ అంటున్నారు.
హిమంత్ బాన్సల్ అనే లా గ్రాడ్యుయేట్, ఐఎఫ్హెచ్ఈలో లా చేస్తున్నారు. ఆ వీడియో బయటకు రావడంతో దుమారం చెలరేగింది. బాన్సల్ తనకు ఎదురైన దారుణాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మొహంపై దాడి చేశారని, వెనకాల తన్నారని.. సున్నితమైన ప్రదేశంలో కూా దాడి చేశారని తెలిపారు. కెమికల్ పౌడర్ చల్లే ప్రయత్నం చేశారని వివరించారు. మర్మంగం తన నోటిలో పెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. తన బట్టలు తీసి వేసి.. నగ్నగా ఉంచి దాడి చేశారని వివరించారు. చచ్చే వరకు కొట్టాలని కొందరు అన్నారని పేర్కొన్నారు.

తనపై జరిగిన దాడి గురించి కాలేజీ యజమాన్యానికి కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. తనపై భౌతిక దాడికి దిగారని వివరించారు. స్నేహితుడితో జరిగిన డిస్కషన్లో మహ్మధ్ ప్రవక్తపై చేసిన కామెంట్లు వివాదానికి దారితీసిందట. ఆ స్నేహితురాలు ఆ చాట్ బహిర్గతం చేయడం వల్ల మిగతా వారికి తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ నిషేధం ఉండటంతో కేసు పైల్ చేశారు.
ఘటనపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఓ విద్యార్థిపై దాడి జరిగితే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అడిగారు. అల్లాహ్ అక్బర్ అనాలని గొడవ చేయడం ఏంటీ అని అడిగారు. ఎంఐఎం చీప్ అసదుద్దీన్ ప్రాతిినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఈ ఘటన జరిగిందన్నారు. కానీ ఇప్పటివరకు అతను ఒక మాట మాట్లాడలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications