మథురలో ఎదురు కాల్పులకు 8 ఏళ్ల బాలుడి బలి
మథుర: పోలీసులకు, నేరస్థులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులకు ఎనిమిదేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో గత రాత్రి పోలీసులకు, నేరస్థులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో బాలుడు మరణించాడు.
ఎదురుకాల్పుల్లో ఓ బుల్లెట్ మాధవ్ భరద్వాజ్ తలలోకి దూసుకెళ్లింది. ఇటీవల జరిగిన ఓ దోపిడీ కేసులోని నిందితులు లక్నోకు 450 కిలోమీటర్ల దూరంలో గల మోహన్పుర గ్రామంలో దాక్కున్నారనే సమాచారం అందిందని, దాంతో తాము దాడి చేసిన సమయంలో ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.

బాలుడికి తగిలిన బుల్లెట్ పోలీసుల ఆయుధం నుంచి వెలువడిందా, నేరస్థుల ఆయుధం నుంచి వెలువడిందా అనేది తెలియయదని అంటున్నారు. నేరస్థులను లోంగిపోవాల్సిందిగా పోలీసులు కోరుతున్న సమయయంలో వారు కాల్పులు ప్రారంభించారని, దానివల్ల ఎదురు కాల్పులు జరిగాయని అంటున్నారు.
బాలుడి కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కేసు విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇస్తూ బాలుడి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించింది.
యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 900 ఎన్కౌంటర్లలో దాదాపు 32 మంది మరణించారు. రాష్ట్రంలోని నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరంచాల్సిన అవసరాన్ని యోగి ఆదిత్యానాథ్, పోలీసు ఉన్నతాధికారులు నొక్కి చెబుతూ వచ్చారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications