మథురలో ఎదురు కాల్పులకు 8 ఏళ్ల బాలుడి బలి
మథుర: పోలీసులకు, నేరస్థులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులకు ఎనిమిదేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో గత రాత్రి పోలీసులకు, నేరస్థులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో బాలుడు మరణించాడు.
ఎదురుకాల్పుల్లో ఓ బుల్లెట్ మాధవ్ భరద్వాజ్ తలలోకి దూసుకెళ్లింది. ఇటీవల జరిగిన ఓ దోపిడీ కేసులోని నిందితులు లక్నోకు 450 కిలోమీటర్ల దూరంలో గల మోహన్పుర గ్రామంలో దాక్కున్నారనే సమాచారం అందిందని, దాంతో తాము దాడి చేసిన సమయంలో ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.

బాలుడికి తగిలిన బుల్లెట్ పోలీసుల ఆయుధం నుంచి వెలువడిందా, నేరస్థుల ఆయుధం నుంచి వెలువడిందా అనేది తెలియయదని అంటున్నారు. నేరస్థులను లోంగిపోవాల్సిందిగా పోలీసులు కోరుతున్న సమయయంలో వారు కాల్పులు ప్రారంభించారని, దానివల్ల ఎదురు కాల్పులు జరిగాయని అంటున్నారు.
బాలుడి కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. కేసు విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇస్తూ బాలుడి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించింది.
యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 900 ఎన్కౌంటర్లలో దాదాపు 32 మంది మరణించారు. రాష్ట్రంలోని నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరంచాల్సిన అవసరాన్ని యోగి ఆదిత్యానాథ్, పోలీసు ఉన్నతాధికారులు నొక్కి చెబుతూ వచ్చారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications