ఇక భారత్ సిద్ధం కావాల్సిందే: సీడీఎస్ సంచలనం
తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు త్రిముఖ వ్యూహాన్ని ప్రయోగించాలని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. ఐఐటీ బాంబేలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చౌహాన్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ స్వల్ప, దీర్ఘకాలిక తీవ్ర సంఘర్షణలు, దీర్ఘకాలిక భూ-కేంద్రీకృత యుద్ధాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. పరోక్షంగా పాక్, చైనా దేశాల నుంచి భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆయన ప్రస్తావించారు.
భారత్ ఎదుర్కొనే సవాళ్లకు సంబంధించి సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ రెండు ప్రధాన అంశాలను వివరించారు. "మన ప్రత్యర్థి దేశాల్లో ఒకటి అణ్వాయుధ దేశం, మరొకటి న్యుక్లియర్ ఆర్మ్ డ్ కలిగిన దేశం. అందువల్ల భారత్ అణు నిరోధక స్థాయిని అధిగమించకూడదు" అని తెలిపారు. ఈ మేరకు చైనా, పాకిస్తాన్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
తీవ్రవాద నివారణకు 'ఆపరేషన్ సింధూర్' వంటి స్వల్పకాలిక, తీవ్రత గల సంఘర్షణలకు భారత్ సిద్ధపడాలని చౌహాన్ పేర్కొన్నారు. భూ వివాదాలున్నందున దీర్ఘకాలిక, భూ-కేంద్రీకృత ఘర్షణలకు కూడా సంసిద్ధంగా ఉండాలని, వాటిని నివారించాలని చౌహాన్ అభిప్రాయపడ్డారు.
మూడో వ్యూహంలో భాగంగా, కొత్త రంగాలను ఉపయోగించుకుంటూ బలహీన ప్రత్యర్థితో అసమానతను పెంచాలని, ఇతర దేశాలు వీటిని దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలని చౌహాన్ వివరించారు. తీవ్రవాదం ముప్పుగానే ఉంటుందని, దానికి రక్షణాత్మక, దాడి ప్రతిస్పందనలు అవసరం అని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు.
ఆధునిక యుద్ధాలు స్వల్పకాలికంగా, మరింత వేగంగా మారుతున్నాయని సీడీఎస్ వివరించారు. "కొత్త రంగాలలో యుద్ధం వేగవంతంగా మారింది. దీని కాలవ్యవధి తక్కువ, తీవ్రత చాలా ఎక్కువ. నిర్ణయాలు తక్కువ సమయంలో తీసుకోవాలి. కేవలం నాలుగు రోజులు మాత్రమే కొనసాగి, భారత్ కు నిర్ణయాత్మక విజయం అందించిన ఆపరేషన్ సింధూర్లో ఇది స్పష్టంగా కనిపించింది" అని ఆయన పేర్కొన్నారు.

ఇక ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. నలుగురు ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ దాడుల వెనకాల ఉన్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications