ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య: బోరుమన్న రామ్ కుమార్
చెన్నై: ఇన్పోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ మరోసారి బోరుమన్నాడు. పోలీసుల విచారణలో అతను ఏడ్చేశాడు. తాను స్వాతిని చంపాల్సి ఉండింది కాదని అన్నాడు. స్వాతిని చంపినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
స్వాతిని చంపాలా, వద్దా అనే డైలమాలో తాను మొదట ఉన్నానని, అయితే స్వాతితో గొడవ తీవ్రం కావడంతో ఏమీ తెలియని స్థితిలో చంపేశానని అతను పోలీసు విచారణలో చెప్పాడు. పచ్చి ప్రేమలో ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేక స్వాతిని చంపానని అతను చెప్పాడు.
భారీ బందోబస్తు మధ్య నుంగంబాక్కం పోలీసు స్టేషన్లో శుక్రవారం చివరి రోజు తమ కస్టడీలో పోలీసులు అతన్ని విచారించారు. తన నేరాన్ని రామ్ కుమార్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తాను స్వాతిని ఎంతగానో ప్రేమించానని, స్వాతిని చంపడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని అతను అన్నాడు.

రామ్ కుమార్ స్వాతిని చంపిన తర్వాత ఆయుధాన్ని విసిరేశాడని, దానిపై అతని వేలి ముద్రలు ఉన్నాయని, ఆమెను హత్య చేసిన తన గదికి వెళ్లి సాయంత్రం పొద్దు పోయేవరకు నిద్రపోయాడని, ఆ తర్వాత తన స్వస్థలానికి వెళ్లాడని పోలీసులు అంటున్నారు.
రామ్ కుమార్ వాంగ్మూలాన్ని తాము నమోదు చేశామని వారు చెప్పారు. ఊహాగానాలకు తెర దించుతూ రామ్ కుమారే స్వాతిని హత్య చేశాడని నిరూపించడానికి తమ వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. స్వాతి ఫోన్ను రామ్ కుమార్ తీసుకుని వెళ్లాడని, దాన్ని అతని నుంచి తాము స్వాధీనం చేసుకున్నామని వారన్నారు.
ఆమె ఫోన్ నుంచి చిత్రాలను తన ఫోన్ మెమొర్ కార్డులోకి డౌన్లోడ్ చేసుకున్నాడని చెప్పారు. రక్తం మరకలు గల చొక్కాను స్వాధీనం చేసుకున్నామని, దాన్ని డిఎన్ఎ పరీక్షలకు పంపించామని చెప్పారు. రామ్ కుమార్ వేలి ముద్రలు మ్యాచ్ అయినట్లు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications