సీమాంధ్ర సమ్మెపై డిగ్గీ హాట్ కామెంట్: బాబు, కిరణ్లపై
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ముసాయిదాను తయారు చేస్తోందని చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలపై తొందరపడ వద్దని కోరారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కైందన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కైతే.. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కయిందా చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందని టిడిపి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదని, ఆయన అన్ని ప్రాంతాలని కలుపుకు పోవాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముఖ్యమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయకుండా వారి వారి సమస్యలు ఏమిటో తమకు చెప్పాలని దిగ్విజయ్ సింగ్ హితవు పలికారు.
విభజనకు సంబంధించిన సమస్యలన్నింటిని తాము కచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు. తెలంగాణపై హోంశాఖ ముసాయిదా తయారు చేస్తోందన్నారు. కేబినెట్ నోట్ తయారైన తర్వాత అసెంబ్లీకి పంపిస్తామని చెప్పారు.