ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి భారత్ తో చేసిందిదే!
డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత్ తో పక్కా వ్యాపారం చేస్తున్నారా? ప్రతీ విషయంలో భారత్ పై మోయలేని ఆర్ధిక భారాన్ని మోపుతున్నారా? తాజాగా గోల్డ్ కార్డ్ ప్రీమియం వీసా సిస్టం తీసుకురావటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంద అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీయాలనే లక్ష్యం
అమెరికా-భారత్ సంబంధాలు డోనాల్డ్ ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టాక తీవ్రంగా మారిపోయాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుండి ఈ సంబంధాల్లో వ్యాపార కోణం ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీయాలనే లక్ష్యం ప్రధానంగా ట్రంప్ నిర్ణయాలలో కనిపిస్తుంది.. అమెరికా అనుసరిస్తున్న "America First" విధానం కారణంగా భారత్తో ఉన్న సమీకరణం వ్యూహాత్మక భాగస్వామ్యం కంటే వాణిజ్య ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుంది.

వీసా ఫీజుల పెంపులతో ట్రంప్ బిజినెస్
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ఆర్థిక లాభాలు, మార్కెట్ ఆధారిత నిర్ణయాలు చుట్టూ తిరుగుతున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దిశలో తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి వీసా ఫీజుల పెంపులు. ఇటీవల అమెరికా ప్రభుత్వం పలు వీసాలపై భారీగా ఫీజులను పెంచింది. ఇప్పటికే టూరిస్ట్ వీసాల (B1/B2) ఫీజులు పెరగడం, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల ప్రాసెసింగ్ ఛార్జీలు పెరగడం భారత పర్యాటకులు మరియు ఉద్యోగులపై ప్రభావం చూపింది.
'గోల్డ్ కార్డ్' ప్రీమియం వీసా సిస్టమ్ కూడా బిజినెస్ మోడల్ లోనే
అంతేకాకుండా, కొత్తగా ప్రవేశపెట్టిన 'గోల్డ్ కార్డ్' ప్రీమియం వీసా సిస్టమ్ ద్వారా వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం అదనపు అధిక ఫీజులు వసూలు చేస్తుండటం అమెరికా వీసా విధానాలు అన్నీ బిజినెస్ మోడల్గా మారుతున్నాయన్న అభిప్రాయాలకు కారణంగా మారింది. ఇప్పటికే విద్యార్థులకు F-1 స్టూడెంట్ వీసాల విషయంలో కఠినతర నిబంధనలు, అదనపు సెక్యూరిటీ చెక్లు, DS-160 ఫీజుల పెంపు భారంగా మారింది.
ఆర్ధిక ప్రయోజనాలే లక్ష్యంగా ట్రంప్ నిర్ణయాలు
భారత విద్యార్థులు అమెరికా ప్రధాన మార్కెట్గా ఉన్న నేపధ్యంలో ఈ నిర్ణయాలు పూర్తిగా ఆర్థిక ప్రయోజనం దృష్ట్యా తీసుకున్నవే అని నిపుణులు భావిస్తున్నారు. కేవలం భారతీయుల నుండి బిజినెస్ చెయ్యాలని, వారి నుండి ఎలా వీలైతే అలా ఆర్ధిక లావాదేవీలలో వసూలు చెయ్యాలని ట్రంప్ భావిస్తున్నారు. వాణిజ్య రంగంలో కూడా ట్రంప్ నుంచి ప్రారంభమైన ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉంది.
భారత్ తో బిజినెస్ ఫస్ట్ అన్నట్టు ట్రంప్ తీరు
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై భారీ ట్యాక్స్ లు, భారత IT రంగంపై వీసా పరిమితులు, ట్రేడ్ డెఫిసిట్ తగ్గించాలనే ఒత్తిడి ఇవన్నీ అమెరికా భారత్ను ఒక పెద్ద బిజినెస్ మార్కెట్గా చూస్తోందని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా మొత్తానికి, అమెరికా-భారత్ సంబంధాల్లో వ్యాపార ప్రయోజనాలు ముందువరుసలో నిలుస్తున్న పరిస్థితి, అమెరికా ఫస్ట్ అని ఫీల్ అవుతున్న ట్రంప్ భారత్ తో బిజినెస్ ఫస్ట్ అన్నట్టు తయారయ్యారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
-
హార్ముజ్ సంగతి తర్వాత-యుద్దం ముగించేద్దాం..! ట్రంప్ మరో షాక్ ..! -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
Tax: తక్కువ పన్ను కట్టే ట్రిక్ ఇదే. ఏ పన్ను విధానం మీకు లాభం? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications