నన్ను అడిగి రాయండి: ఐఐటీ ల్యాండ్ అకాడమీ కాంట్రోవర్సీపై సచిన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ మాజీ సారథి, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ తన పైన వచ్చిన మీడియా ఆరోపణలను ఆదివారం నాడు కొట్టి పారేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో అకాడమీ ఓపెన్ చేసేందుకు సచిన్ కొంత భూమి అడిగినట్లుగా వార్తలు వచ్చాయి.
దీని పైన సచిన్ స్పందించారు. తాను ఐఐటీలో అకాడమీ ఓపెన్ చేసేందుకు ల్యాండ్ అడిగినట్లుగా వచ్చిన వార్తలను కొట్టి పారేశారు. సచిన్ టెండుల్కర్ రాజ్యసభ సభ్యుడు. తన పైన జరిగిన ప్రచారం పైన ఆయన సామాజిక అనుసంధాన వెబ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.
తన పైన వచ్చిన కథనం తనను ఆందోళనకు గురి చేసిందని పేర్కొన్నారు. అది వాస్తవ దూర కథనం అని చెప్పారు. తాను ఎలాంటి అకాడమీని ప్రారంభించాలనుకోలేదని, అందుకు ఐఐటీ ఢిల్లీని కోరలేదని పేర్కొన్నారు. ఎవరైనా తన పైన కథనాలు రాసేముందు తనను అడిగి, అది సరైందో కాదో తెలుసుకోవాలని చెప్పారు.
I
am
appalled
to
read
the
stories
that
suggest
some
land
has
been
asked
from
IIT-D
for
academy
in
my
name.
—
sachin
tendulkar
(@sachin_rt)
December
28,
2014
I
have
not
even
planned
any
academy
neither
do
I
want
any
piece
of
land
for
any
purpose.
—
sachin
tendulkar
(@sachin_rt)
December
28,
2014
Wish
that
basic
facts
are
checked
from
me
before
publishing
such
fiction
using
my
name.
—
sachin
tendulkar
(@sachin_rt)
December
28,
2014