జయలలిత ఆస్తుల కేసుపై సుప్రీంలో ఇంకా ఉత్కంఠనే
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తుల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. అక్రమాస్తుల కేసును విచారించిన సుప్రీం కోర్టు మంగళవారం నాడు తీర్పును రిజర్వ్లో ఉంచింది.
అక్రమాస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవ రాయ్లతో కూడిన సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ కర్ణాటక ప్రభుత్వం, ఇతర పిటిషన్దారులను జూన్ 10లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన కేసు విచారణ గత వారం పూర్తయింది.
జయలలిత అక్రమాస్తుల కేసు సుదీర్ఘంగా పద్దెనిమిదేళ్ల పాటు విచారణ జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేక న్యాయస్థానం ఆమెను అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కర్ణాటక హైకోర్టు గత ఏడాది ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. జయలలితను నిర్దోషిగా విడుదల చేయడంపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications