13 ఏళ్ల బాలికపై లైంగికదాడి, మత మార్పిడి చేసుకుంటే పెళ్లి, అరెస్ట్
ఇటీవల దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆ ఇన్సిడెంట్ బట్టి దేశం ఎటువైపు వెళుతుందనే సందేహాం కలుగక మానదు. కర్ణాటకకు చెందిన యునూస్ పాషా అలియాస్ ఫయాజ్ మహ్మద్ అనే వ్యక్తి.. ఓ మైనర్పై లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఆమె నగ్న ఫోటోలు తీసి మరీ బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ విషయం పేరంట్స్కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంటి పక్కనే పాషా ఉండేవాడు. ఇంకేముంది ఆమెతో మచ్చిక చేసుకున్నాడు. ఆమెకు స్మార్ట్ ఫోన్ కూడా కొనిచ్చాడట. వారిద్దరూ కలిసి వీడియో కాల్స్ కూడా మాట్లాడేవారట. అలా వారిద్దరూ చాట్ చేయడం.. న్యూడ్గా కాల్ చేయడం చేసేవారు. అలా వాటిని చూపించి ఆమెపై లైంగికదాడి చేశారు. తర్వాత ఆమె తలొగ్గకపోవడంతో వాటిని కుటుంబ సభ్యులకు చూపిస్తానని చెప్పి బెదిరించాడు. అలా ఆమెను లొంగదీసుకున్నాడు.
ఈ నెల 8వ తేదీన చిన్నారి కుటుంబ సభ్యులు షిరిడీ వెళ్లారు. ఆమె, తన నానమ్మతో కలిసి ఇంట్లో ఉంది. దీనిని అతను అవకాశంగా తీసుకున్నాడు. నానమ్మకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. ఆమె పడుకున్నాక.. బాలికపై లైంగికదాడి చేశాడు. ఆమె ఇస్లాం మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని అతను చెప్పాడు.
షిరిడి నుంచి నవంబర్ 12వ తేదీన బాలిక పేరంట్స్ వచ్చారు ఆమెలో మార్పును అతను గమనించాడు. ఏం జరిగిందో అడగగా.. బాలిక పూస గుచ్చినట్టు తెలిపింది. ఆ మరునాడు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనికి అప్పటికే పెళ్లి అయ్యిందని.. ఒక చిన్నారి ఉందని కూడా తెలిసింది. అతనిపై పోక్సో, మత మార్పిడికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.