అసెంబ్లీలో హాయిగా కునుకేసిన ఎమ్మెల్యేలు: అంత సీరియస్ చర్చ జరుగుతుంటే!..
ప్రజాప్రతినిధులు పనితీరును ప్రజలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో యోగి ఈ నిర్ణయం తీసుకోగా.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిద్రలోకి జారుకోవడం చర్చనీయాంశంగా మారింది.
లక్నో: ఓవైపు జీఎస్టీ బిల్లుపై అసెంబ్లీలో సీరియస్గా చర్చ, మరోవైపు విపక్ష సభ్యుల ఆందోళన నడుమ.. కొంతమంది ఎమ్మెల్యేలు సాఫీగా కునుకుతీయడం చర్చనీయాంశంగా మారింది. యూపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే సభలో ఈ దృశ్యం కనిపించింది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ తొలి సమావేశాలను.. యూపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ సీట్లలోనే గాఢ నిద్రలోకి జారిపోవడం స్పష్టంగా కనిపించింది. గతంలో యూపీ అసెంబ్లీ సమావేశాలను లైవ్ టెలికాస్ట్ చేయాలన్న ప్రయత్నాలు జరిగినప్పటికీ.. యోగి సీఎం అయిన తర్వాతే ఈ నిర్ణయం ఆచరణకు నోచుకుంది.

ఈ మేరకు దూరదర్శన్ చానెల్ యూపీ అసెంబ్లీ సమావేశాలను లైవ్ ప్రసారం చేస్తోంది. కాగా, తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలను టీవీల్లో చూద్దామనుకున్న ప్రజలు.. తమ ఎమ్మెల్యేలు కునుకు తీయడం చూసి ఆశ్చర్యపోయారు. కునుకు తీసినవారిలో ఓ మంత్రి కూడా ఉండటం గమనార్హం.
ప్రజాప్రతినిధులు పనితీరును ప్రజలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో యోగి ఈ నిర్ణయం తీసుకోగా.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిద్రలోకి జారుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లును అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆమోదించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే యూపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications