3 వేల వీసాలు: బ్రిటన్కు వెళ్లే వారికి ఆఫర్: రిషి సునాక్
బ్రిటన్ కూడా భారతీయులకు మంచి ఆఫర్ ఇచ్చింది. ఆ దేశం వెళ్లాలనుకొనే వారికి ఏటా 3 వేల వీసాలు అందించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆమోదం తెలిపారు. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జి-20 సదస్సులో భాగంగా భారత ప్రధాని మోడీతో సునాక్ కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లో బ్రిటన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది.
బ్రిటన్ పౌరులు సైతం భారత్లో నివసించడానికి, పనిచేయడానికి కూడా వీలు కల్పించే ఈ పథకాన్ని 2023 సంవత్సరం మొదట్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న డిగ్రీ పట్టభద్రులైన భారతీయ పౌరులు బ్రిటన్కు వచ్చి రెండేళ్ల వరకూ చదువుకోవడంతోపాటు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా ఏటా 3వేల వీసాలు అందజేస్తాం అని బ్రిటన్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

వాణిజ్యం, రక్షణ, భద్రత, రవాణా రంగాల్లో పరస్పర సహకారంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో మోడీ చర్చించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, సింగపూర్ ప్రధాని లీ హెసియెన్, జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఆస్ట్రేలియా, ఇటలీ ప్రధానులు ఆల్బనీస్, మెలోనీలతో వివిధ అంశాలపై చర్చించారు.
సౌదీ అరేబియా కూడా నిబంధనలను సులభతరం చేసింది. అంతకుముందే బ్రిటన్ కూడా ఆఫర్ ఇచ్చింది. దీంతో విదేశాలకు వెళ్లే భారతీయులకు మేలు జరిగినట్టు అయ్యింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications