video:గిరిజనులతో కలిసి రాహుల్ గాంధీ స్టెప్పులు, సంబరపడ్డ గిరిపుత్రులు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. యాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ ఉదయం మహబూబ్ నగర్ మండల పరిధిలో గిరిజనులతో కలిసి డ్యాన్ వేశారు. ఆయన పక్కన సంపత్ కుమార్, గిరిజనులు ఉన్నారు. వారితో చక్కగా స్టెప్పులు వేశారు. ఆ వీడియోను తన ట్వీట్ చేశారు. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో రాహుల్ గాంధీ సంప్రదాయ నృత్యం చేశారు.
రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర ఉదయం 6 గంటలకు మహబూబ్ నగర్ మండల పరిధిలోని ధర్మాపూర్లో ఉన్న జయప్రకాశ్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమైంది. యాత్రలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్సింగ్, ఏఐసీసీ సభ్యుడు జైరాం రమేష్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క, సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ తమతో కలిసి డ్యాన్సులు వేయటంతో గిరిజనులంతా తెగ సంబర పడిపోయారు.ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. పాదయాత్ర దారిపోడవునా రాహుల్ గాంధీ పలువురితో కలిసి మాట్లాడారు. చిన్నారులను భుజాలపై ఎక్కించుకుని నడుస్తున్నారు.చేనేత కార్మికులు వారి సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని తొలగించి, పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు.
Our tribals are the repositories of our timeless cultures & diversity.
— Rahul Gandhi (@RahulGandhi) October 29, 2022
Enjoyed matching steps with the Kommu Koya tribal dancers. Their art expresses their values, which we must learn from and preserve. pic.twitter.com/CT9AykvyEY