ఆసిఫాబాద్ జిల్లాలో 15మంది గురుకుల పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత.. రీజన్ అదేనా?
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలలో పరిస్థితులు మారడం లేదు. విద్యార్థుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యమో, పర్యవేక్షణ లోపమో సంక్షేమ పాఠశాలలో చదువుకుంటున్న బాలబాలికలు అస్వస్థతకు గురి అవుతూ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల కస్తూర్బా గురుకులంలో 15మందికి అస్వస్థత
మొన్నటికి మొన్న వర్ధన్నపేట సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో బల్లి పడిన ఆహారం తిని 33 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో శుక్రవారం నాడు 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఆస్పత్రికి తరలించి చికిత్స .. పరీక్షకు విద్యార్థినుల రక్త నమూనాలు
నీరసం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థినులను పాఠశాల సిబ్బంది చికిత్స కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ లో తరలించారు. విద్యార్థులకు చికిత్స చేసిన అనంతరం మళ్లీ అందరు విద్యార్థులను కస్తూర్బా విద్యాలయానికి తీసుకువచ్చారు.
విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని బట్టి కొందరికి ఇంజక్షన్లు చేశామని, మరికొందరికి సెలైన్లు పెట్టామని, వారందరినీ రక్తనమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం పంపించామని, ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు.
ఇక వారు ఏ కారణంతో అస్వస్థతకు గురయ్యారు అన్నది తెలియరాలేదు. ఇటీవల వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందా అన్న అనుమానం స్థానికంగా వ్యక్తం అవుతుంది.

గురుకులాలలో తరచూ విద్యార్థుల అస్వస్థత ఘటనలు
గురుకులపాఠశాలలోనూ, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలోను తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంపై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, విద్యార్థులకు వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆకస్మిక తనిఖీలు చేస్తున్న కలెక్టర్లు.. ప్రభుత్వం కూడా సీరియస్ గానే చర్యలు
ఇక ఇప్పటికే అనేక జిల్లాలలో కలెక్టర్లు హాస్టల్స్ , వసతి గృహాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ హాస్టల్స్ లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇక హాస్టల్స్ పై పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. అయినప్పటికీ రోజుకొక హాస్టల్లో విద్యార్థులు వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. వారు తీసుకుంటున్న ఆహారం, త్రాగునీరు లోపమా? లేకా సీజనల్ వ్యాధులతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే చాలా హాస్టల్స్ లో ఆహారమే సమస్య అని విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications