బిల్డింగ్ పై నుండి పడి బాలిక మృతి; మిస్టరీగా డెత్ కేసు; అన్నీ అనుమానాలే!!
హైదరాబాద్: హైదరాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్లోని చంద్రపురి కాలనీలో మంగళవారం రాత్రి అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలిక భవనంపై నుంచి పడి మృతి చెందింది. అయితే బాలిక మృతి కొత్త అనుమానాలకు కారణంగా మారింది. ఇంట్లో స్టోర్స్ కు వెళ్తున్నా అని చెప్పి బాలిక చంద్రపురి కాలనీ లోని భవనం పైకి ఎందుకు వెళ్ళింది? అసలు అక్కడి నుంచి క్రింద ఎలా పడిపోయింది అన్న అంశం ఇప్పుడు మిస్టరీగా మారింది.

కిరాణా షాప్ కు వెళ్తున్నా అని చెప్పి ఓ బిల్డింగ్ పై నుండి పడి మృతి చెందిన బాలిక
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీ నగర్లోని మధురానగర్లో నివాసముంటున్న సత్యనారాయణ రెడ్డి రెండో కుమార్తె తొమ్మిది సంవత్సరాల వర్షిత సమీపంలోని ప్రొవిజన్స్ స్టోర్కు వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఆటోలో చంద్రపురి కాలనీ లోని ఓ బిల్డింగ్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆటోడ్రైవర్ ఫోన్ నుండి గుర్తుతెలియని వ్యక్తి కి ఫోన్ చేసింది. కొద్దిసేపటి తరువాత, అక్కడ భవనంపై నుండి క్రింద పడి చనిపోయింది.

ఆటోలో బాలిక వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు.. మిస్టరీ డెత్ లో అన్నీ అనుమానాలే
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. బాలిక ఇంటి నుంచి ఆటోరిక్షాలో వెళ్లి, చంద్రపురి కాలనీలో భవనంలోకి వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు బాలిక ఆటోలో వెళుతున్న సమయంలో ఎవరికి కాల్ చేసింది? ఎందుకు బాలిక చంద్రపురి కాలనీ కి వెళ్ళింది? ఆ బిల్డింగ్ లోకే బాలిక ఎందుకు వెళ్ళింది? బాలిక పై నుండి ఎలా పడిపోయింది? వంటి అనేక ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. ఇక వర్షితది హత్యనా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించడంతో పాటుగా భవనంలో ఉన్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

బాలిక మృతదేహం పోస్ట్ మార్టం, ఆటోవాలా నోరు విప్పితే క్లూ దొరికే ఛాన్స్
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం బాలిక మృతికి సంబంధించి అనేక విషయాలు తెలిసే అవకాశం ఉంది. అంతే కాకుండా అక్కడ ఘటనా స్థలంలోనే అన్ని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు ఈ మిస్టరీ డెత్ కేసును చేధించే పనిలో పడ్డారు. ఆటోవాలా నోరు విప్పితే అసలు విషయం తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

షాక్ లో తల్లిదండ్రులు, తమ బిడ్డకు ఏమైందో చెప్పాలని పోలీసులకు వేడుకోలు
తల్లిదండ్రులు కూడా బాలిక అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఆటోలో ఎలా వెళ్ళింది? ఆ భవనంలోకే ఎందుకు వెళ్ళింది? పై నుండి ఎలా క్రింద పడిపోయింది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నారు. బాలిక విషయంలో ఏం జరిగిందో అర్ధం కాక, విగత జీవిగా మారిన చిన్నారిని చూసి విలపిస్తున్నారు. పోలీసులు తమ బిడ్డ మృతికి గల కారణాలను కనుక్కోవాలని వారు కోరుతున్నారు. తిరిగిరాని లోకాలకు చేరిన తమ బిడ్డను చూసి కంటికి కడివెడు కన్నీరు కారుస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications