కేంద్రంపై పోరులో కేసీఆర్ బిగ్గెస్ట్ స్కెచ్... కేంద్ర ప్రభుత్వోద్యోగులు, దర్యాప్తు సంస్థల అధికారులకు షాక్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు, ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ దాడుల నేపథ్యంలో కేంద్రంపై పోరుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న కేసీఆర్ బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకున్నారు. కేంద్రంపై పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని కెసిఆర్ ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎరకేసులో తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నేతలను కూడా టార్గెట్ చేసుకోనున్నారు.

కేంద్రప్రభుత్వ ఉద్యోగులపై కేసీఆర్ అస్త్రం
సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరు ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై నజర్ పెట్టిన కెసిఆర్ ఈ క్రమంలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాబితాను రెడీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారిలో లంచావతారాలను గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇక ఈడి, ఐటి అధికారులు విచారణలో భాగంగా ఎవరి పైన అయినా చేయి చేసుకున్నా కేసులు నమోదు చేయాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఏసీబీని రంగంలోకి దించనున్న కేసీఆర్ .. డార్క్ రూమ్ దాడులపైనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ముఖ్య నాయకులు, వ్యాపారవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు టార్గెట్ గా సాగుతున్న ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో ఏసీబీ ని రంగంలోకి దించాలని నిర్ణయించిన కేసీఆర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ డి, ఐటీ దాడుల నేపథ్యంలో డార్క్ రూమ్ దాడుల పైన కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడానికి ఏసీబీకి ఉన్న అధికారాలు, ఆ తర్వాత దశలో కేసు విచారణ చేయడానికి అనుమతి తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వోద్యోగులపై ఫిర్యాదులు అందితే దాడులు.. కేసులే
ఇక తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు అందితే తక్షణం వారిపై దాడి చేసి కేసులు నమోదు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏసీబీకి ప్రభుత్వం నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులపైన కూడా ఫోకస్ చేయనున్న కేసీఆర్, కేంద్రం, ఏ విధంగా అయితే దర్యాప్తు సంస్థలతో టిఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి పెడుతుందో, బీజేపీ లో ఉన్న కీలక నాయకులను అదేస్థాయిలో ఎమ్మెల్యేల ఎరకేసుతో పాటు, రకరకాల కేసులలో ఒత్తిడికి గురి చేయాలని నిర్ణయించినట్లు గా సమాచారం.

కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపైనా ఫిర్యాదులు అందితే కేసులే..
ఏదేమైనా దెబ్బకు దెబ్బ తీయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా న్యాయనిపుణులతో చర్చించి కేంద్రంలోని అధికార బీజేపీ ని ఇరకాటంలో పెట్టేందుకు బడా వ్యూహాన్ని రచించారు. ఇక తాజాగా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులను పలువురుని చీకటి గదిలోకి తీసుకు వెళ్లి అధికారులు చేయి చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల పైన కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయించాలని తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. మొత్తానికి కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న వేళ దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తూ సాగించే సమరంలో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications