మూడింటిపై ఆశలు, ఓడే సెగ్మెంట్లపై సందేహాలు!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఉంది. నాగర్ కర్నూల్లో నాగం జనార్దన్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా, ఆయన కూడా సెంటిమెంట్పైనా పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కనిపించట్లేదు. ఆదిలాబాద్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. స్టేషన్ఘన్పూర్లో సెంటిమెంట్ను అధిగమించడంపై అధికారపక్షం దృష్టి సారించింది. ఇక, సీమాంధ్ర నుంచి ఉప ఎన్నిక జరుగుతున్న ఏకైక స్థానం కోవూరు కూడా కాంగ్రెస్కు కీలకం కానున్నది. ఈనెల 9న కోవూరులో కిరణ్ ప్రచారాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందరెడ్డి, కృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డిలతో కిరణ్ తాజాగా సమీక్షించారు. ఆ సమీక్ష తర్వాత ఇక్కడ నుంచి తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తంచేశారు. ఏడు నియోజకవర్గాల్లో నాలుగింటిలో గట్టి పోటీ ఉన్నందున ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని భావించడం లేదని కిరణ్ కూడా భావిస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications