మూడింటిపై ఆశలు, ఓడే సెగ్మెంట్లపై సందేహాలు!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఉంది. నాగర్ కర్నూల్లో నాగం జనార్దన్ రెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా, ఆయన కూడా సెంటిమెంట్పైనా పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కనిపించట్లేదు. ఆదిలాబాద్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. స్టేషన్ఘన్పూర్లో సెంటిమెంట్ను అధిగమించడంపై అధికారపక్షం దృష్టి సారించింది. ఇక, సీమాంధ్ర నుంచి ఉప ఎన్నిక జరుగుతున్న ఏకైక స్థానం కోవూరు కూడా కాంగ్రెస్కు కీలకం కానున్నది. ఈనెల 9న కోవూరులో కిరణ్ ప్రచారాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందరెడ్డి, కృష్ణారెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డిలతో కిరణ్ తాజాగా సమీక్షించారు. ఆ సమీక్ష తర్వాత ఇక్కడ నుంచి తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తంచేశారు. ఏడు నియోజకవర్గాల్లో నాలుగింటిలో గట్టి పోటీ ఉన్నందున ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని భావించడం లేదని కిరణ్ కూడా భావిస్తున్నారు.