Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fake : ఆ వీడియోకు పంజాబ్‌కు సంబంధం లేదు... అది జియో టవర్ కాదు...

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో నిరసన తెలియజేస్తున్న రైతులు సెల్‌ఫోన్ టవర్లను ధ్వంసం చేస్తుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెల్‌ టవర్లను ధ్వంసం చేయవద్దని స్వయంగా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రైతులకు విజ్ఞప్తి చేసినప్పటికీ వారి ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ సెల్‌ఫోన్ టవర్‌కు నిప్పంటించిన ఫోటో,వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. 'రైతు ఉద్యమ ఎఫెక్ట్... కాలిపోతున్న జియో టవర్..' అని ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. అయితే వాస్తవమేమిటంటే ఈ వీడియోలో కాలిపోతున్నది జియో టవర్ కాదు. అసలు ఇది పంజాబ్‌కి సంబంధించిన వీడియో అంతకన్నా కాదు.

Fake: This is not a Reliance Jio tower burnt during the ongoing farmer protests

2017లో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో తగలబడిన టవర్ ఇది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి టవర్ తగలబడింది. అప్పట్లో ఈ వార్తను పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. ప్రస్తుతం పంజాబ్‌లో రైతులు సెల్‌ఫోన్ టవర్లను ధ్వంసం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వీడియో మరోసారి వైరల్‌గా మారింది.

ఇది పంజాబ్‌లో జియో టవర్‌ను తగలబెట్టిన ఫోటోగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఆ కాలిపోతున్న టవర్‌ ఫోటో డెహ్రాడూన్‌లో జరిగిన ఘటనకు సంబంధించినది. దీనికి పంజాబ్ రైతు ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదు.

Fact Check

వాదన

పంజాబ్‌లో తగలబడ్డ జియో టవర్

వాస్తవం

అది 2017లో డెహ్రాడూన్‌లో తగలబడిన టవర్

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+