వార్,ఎంసిసిల విలీనం: నేత గణపతి
హైదరాబాద్:సిపి ఐ (యంయల్) పీపుల్స్వార్,మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఐ)విలీనమమై కొత్త పార్టీగా అవతరించింది. ఈరెండు పార్టీలను విలీనం చేసి భారతకమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ను ఏర్పాటుచేశారు. ఈ విషయాన్ని పీపుల్స్వార్నాయకుడు సుధాకర్ గురువారంవిలేకరుల సమావేశంలోవెల్లడించారు. అంతకు ముందేతెలుగు ఛానళ్లలో ఈ వార్తప్రసారమైంది. సెప్టెంబర్ ఇరవై ఒకటవతేదీన విలీనమైనట్లు సుధాకర్చెప్పారు. ఈ విలీనం వివరాలనుపీపుల్స్వార్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిరామకృష్ణ విలేకరుల సమావేశంలోవివరించారు. కొత్త విప్లవ పార్టీకి ఇప్పటివరకు పీపుల్స్వార్ కేంద్ర కమిటీకార్యదర్శిగా వ్యవహరిస్తున్నగణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు కార్యదర్శిగా ఎన్నికయ్యారనిఆయన చెప్పారు.
భద్రతాకారణాల రీత్యా ఈ విలీనం విషయాన్నిదేశవ్యాప్తంగా తాము ఒకేసారివెల్లడించినట్లు రామకృష్ణ చెప్పారు. ఈరెండు విప్లవ పార్టీల మధ్యపాతికేళ్లుగా ప్రయత్నాలుజరుగుతున్నాయి. పందొమ్మిది వందలడెబ్బై ఎనిమిదిలో విలీనానికి ప్రతిపాదనవచ్చింది. పందొమ్మిది వందల ఎనబై ఒకటవపీపుల్స్వార్ నేత కొండపల్లిసీతారామయ్య, ఎంసిసి కనోయ్ ఛటర్జీపన్నెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. ఒకతరహా విప్లవ పంథానుఅనుసరిస్తుండడం వల్ల విలీనానికిప్రతిపాదన, చర్చలు జరిగాయి.పందొమ్మిదివందల ఎనబై రెండులో కనోయ్ ఛటర్జీమరణించారు. కొండపల్లిసీతారామయ్య అరెస్టయ్యారు. దీంతోచర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.పీపుల్స్వార్లోని అంతర్గత విభేదాలవల్ల కొంత ఆలస్యం జరిగింది. పందొమ్మిదివందల తొంబై రెండులో మళ్లీ చర్చలుప్రారంభమయ్యాయి. మూడేళ్ల పాటుపెద్ద యెత్తున చర్చలు జరిగాయి.ఎట్టకేలకు చర్చలు ఫలించి రెండు పార్టీలవిలీనం జరిగింది. ఈరెండు పార్టీలకు గెరిల్లా ఆర్మీలున్నాయనిరామకృష్ణ చెప్పారు. ఈ రెండు పార్టీలగెరిల్లా ఆర్మీలను కలిపి పీపుల్స్ గెరిల్లాలిబరేషన్ ఆర్మీగా పిలువనున్నట్లు ఆయనతెలిపారు. ఇతర విప్లవ పార్టీలతోఐక్యతకు కూడా చర్చలుజరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సిపిఐ (యంయల్) జనశక్తితో ఇప్పటికేకలిసి నడుస్తున్నామని ఆయనచెప్పారు. ఈ విలేకరుల సమావేశంలోజనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శిఅమర్ రామకృష్ణ పక్కనేకూర్చున్నారు. ఈ రెండు పార్టీల విలీనంభారత ప్రజల ముందు ఆశావహ స్థితినితెచ్చిందని అమర్ అన్నారు.More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications