హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెప్పాల్సిన అవసరం లేదు: స్పీకర్

By Staff
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: మీడియాపై ఎందుకు ఆంక్షలు విధించామనేది చెప్పాల్సిన అవసరం తనకు లేదని శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మీడియాపై విధించిన ఆంక్షలపై తెలుగుదేశం తక్షణ చర్చకు పట్టుబట్టిన సమయంలోనూ, ఆ తర్వాతా ఆయన మంగళవారం శాసనసభలో ఆయన ఈ విషయాన్ని పదే పదే చెప్పారు. మీడియాపై ఆంక్షల విషయాన్ని తాను బిఎసిలో అన్ని పక్షాలవారికి చెప్పినట్లు ఆయన తెలిపారు. మీడియాపై ఆంక్షల విధింపుపై తాను చెప్పాల్సిన అవసరం లేదని, అయితే ప్రజలకు తెలియాలి కాబట్టి వివరిస్తానని ఆయన చెప్పారు. మీడియాపై విధించిన ఆంక్షలపై తక్షణ చర్చకు తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టి ఒక రోజు సస్పెండ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ మాట్లాడారు.

స్పీకర్ తమ స్వేచ్ఛను కాపాడాలని, స్పీకర్ కాపాడకపోతే ఎవరు కాపాడుతారని, మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలని రాజేందర్ అన్నారు. ఈ సమయంలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి మీడియాపై విధించిన ఆంక్షలపై తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షాలను బయటకు పంపి సభను నడిపించుకుంటామంటే హుందాగా ఉండదని, ఫ్లోర్ లీడర్లను పిలిసి మాట్లాడుతానని స్పీకర్ అంటే సరిపోయేదని రాజేందర్ అన్నారు. తాను బిఎసిలోనే చెప్పానని స్పీకర్ చెప్పారు. తాను రోజూ మీడియాను కలుస్తూనే ఉన్నానని, తన బాధ్త ఏమిటో తనకు తెలుసునని, ఏం చేయాలనే విషయంపై తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X