విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పేరుతో మోసం, లేడీ కిలాడీ అరెస్టు

By Santaram
|
Google Oneindia TeluguNews

Krishna Dist
కృత్తివెన్ను: వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్ పేరుతో ఇంతేరు గ్రామస్తులను మరోసారి మోసగించేందుకు ప్రయత్నించిన మహిళ కటకటాలపాలయ్యింది. స్నేహ సంస్థ ద్వారా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తానంటూ ఇంతేరు గ్రామంలో ప్రచారం చేపట్టిన మహిళ కొన్ని జిరాక్స్‌ కాపీలను ప్రజలకు అంటగట్టి డబ్బు వసూలుకు ప్రయత్నించింది. అనుమానించిన సర్పంచ్‌ చింతా వడ్డీకాసులు, మాజీ సర్పంచ్‌ ఏడుకొండలు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

కృత్తివెన్ను ఎస్సై ఎల్‌ రమేష్‌ కథనం ప్రకారం విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన శాలి శారమ్మ (చిన్ని) ఆదివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఇంతేరుకు చేరుకుంది. ఇదే మహిళ 20 రోజుల క్రితం ఇంతేరుకు వచ్చి వైయస్ పేరున ఆయన తనయుడు జగన్‌ ట్రస్టు ఏర్పాటు చేశారని నమ్మబలికి డ్వాక్రా మహిళల నుంచి రూ.11,500 వరకు వసూలు చేసింది. విషయాన్ని గమనించిన స్థానిక యువకులు ఆమెను అడ్డుకు డబ్బులు స్వాధీనం చేసుకుని హెచ్చరించి వదిలేశారు.

అదే మహిళ మళ్లీ గ్రామానికొచ్చి జిరాక్స్‌ కాపీలను గ్రామస్తులకు పంచిపెడుతూ ఒక్కొక్కరు రూ. 50 చెల్లిస్తే పది కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, మంచినూనె ప్యాకెట్‌ ఇస్తామని నమ్మబలికింది. సర్పంచ్‌ వెంటనే ఎస్సైకు సమాచారం ఇవ్వడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఇచ్చిన నంబర్లకు ఫోన్‌ చేసిన ఎస్సై మోసగత్తె అని తేలడంతో కేసు నమోదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X