వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీజీ పరీక్షలు బహిష్కరించిన కెయు: ర్యాలీపై లాఠీఛార్జ్, ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించే వరకు తాము పరీక్షలు రాసేది లేదని వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల విద్యార్థులు శుక్రవారం పీజీ పరీక్షలను బహిష్కరించి కలెక్టరేట్ ముట్టడి తలపెట్టారు. ఇది తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే పరీక్షలు రాస్తామని విద్యార్థులు భీష్మించారు. పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు కెయు నుండి అమరవీరుల స్థూపం వద్దకు భారీ ర్యాలీగా బయలు దేరారు. అయితే పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.

దాంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎంతకూ అనుమతించక పోయినప్పటికీ విద్యార్థులు ర్యాలీ తీయడంతో ఇరువర్గాలకు తోపులాట జరిగింది. విద్యార్థులు కలెక్టరేట్ వైపు, అమరవీరుల స్థూపంవైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. 50 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కెయులో పోలీసులు లేకున్నప్పటికీ కెయు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X