వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేర్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు రోశయ్య, జగన్ పరామర్శ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఓల్డ్ సిటీలో కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీని పలువురు నేతలు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి శంకర్రావు, భాజపా నేత విద్యాసాగరరావు, కడప మాజీ ఎంపీ జగన్మోహన్‌రెడ్డి తదితరులు ఆయన్ను వేరువేరుగా పరామర్శించారు. అత్యవసర చికిత్సా విభాగంలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్‌ను చూసేందుకు వైద్యులు లోపలికి అనుమతించడం లేదు.

కాగా ఆయన త్వరగా కోలుకోవాలని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కోరుకున్నారు. పాతబస్తీలో మైనార్టీలకు ఎంతో సేవలు అందించారని అన్నారు. ప్రభుత్వం అక్బరుద్దీన్ వైద్యం కోసం ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం అని హోంమంత్రి సబితారెడ్డి ప్రకటించారు. కేసును సిసిఎస్ పోలీసులకు అప్పగిస్తున్నట్టు చెప్పారు. జగన్ తన ప్రచారాన్ని వాయిదా వేసుకొని హైదరాబాద్ వచ్చారు.

English summary
Ex chief Minister Rosaiah, Ministers Shankar Rao, Sabitha Indra Reddy were met care hospitals doctors on MIM MLA Akbaruddin Owaisi health condition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X