చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎంకెపై రంజిత, నిత్యానంద జాయింట్ అటాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nithyananda Swami
చెన్నై: రాసలీలల కేసులో ఇరుక్కున్న సినీ నటి రంజిత, నిత్యానంద స్వామి బుధవారం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎంకె పార్టీ, సన్ నెట్ వర్క్‌పై ధ్వజమెత్తారు. డిఎంకె వారు తమను కావాలనే రాసలీలల కేసులో ఇరికించారని వారు ఆరోపించారు. తమను అనవసరంగా నిందించినందుకే ఆ పార్టీ ఓటమి పాలయిందన్నారు. ఆ పార్టీకి ముందు ముందు మరిన్ని కష్టాలు తప్పవన్నారు. జర్నలిజం పేరుతో తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూశారని సన్ నెట్ వర్క్, నక్కీరన్‌పై వారు విరుచుకు పడ్డారు. వీడియోలో ఉన్నది తాము కాదని వారు చెప్పారు.

వీడియోలను నక్కీరన్ మార్ఫింగ్ చేసి తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూసిందని ఆరోపించారు. అరవై కోట్ల రూపాయలు తమను డిమాండ్ చేశారని వారు ఆరోపించారు. మార్పింగ్ వెనుక సన్ నెట్ వర్క్ హస్తం సైతం ఉందని వారు అభిప్రాయపడ్డారు. వీడియో ఓ బూటకం అని అన్నారు. వీడియోలో ఉన్నది తాను కాదని నటి రంజిత చెప్పారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో తప్పుడు కథనాలు రాశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియోలను మార్ఫింగ్ చేసి తన జీవితాన్ని నాశనం చేశారని విమర్శించారు. తాను నిత్యానందతో రాసలీలలు చేశాననడంలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. కాగా రంజిత చెన్నైలో సన్ నెట్ వర్క్ పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రంజిత ఫిర్యాదు వెనుక జయలలిత ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Heroine Ranjitha and Nithyananda fired at DMK party and sun network today in their media conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X